ముద్ర,తెలంగాణ:- హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి సమీరుల్లాఖాన్ ముందే కార్వాన్కు చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ కో ఆర్డినేషన్ సమావేశంలో ఈ విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వర్గంగా వీడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంతజెప్పినా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇక చేసేదేమి లేక గాంధీభవన్ నుంచి అసహనంతో వెళ్లిపోయారు ఎంపీ సవల్లాఖాన్.