ముద్రణ ప్రతినిధి, నిర్మల్:గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో బి ఆర్ ఎస్, బిజెపి చేసిందేమిటని ప్రదర్శించారు పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. నిర్మల్ రత్నాపూర్ కాండ్లీ లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార జిల్లా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
ఆంగ్లేయుల ఏలుబడిలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాలకు నిలయమని అన్నారు. పదేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటున్న మనలో విభేదాలు పెరుగుతున్నాయని. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన 6 హామీలు ఇప్పటికే అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతాయి.
తమ మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలకుఏ కష్టం వచ్చినా ముందుండి వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళకు రూ.1లక్ష నగదు సాయంతో పాటు నెలసరి పింఛన్లు, సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని, రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కూడా అమలవుతున్నాయని చెప్పారు.
పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో మోసగించిందే తప్ప, అమాయక, పేద ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఈనెల 13న ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తుకు ఓటు వేసి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణ ను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా నిర్ణయించారు. సిరాజ్ ,గాజుల రవికుమార్, పూదరి అరవింద్, కొంతం గణేష్ ఉన్నారు.