న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్కప్–2023 ఫైనల్ భారత్–ఆసీస్ మధ్య అహ్మదాబాద్లో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫుల్ విమానయానశాఖకు చెందిన గుజరాత్, అహ్మదాబాద్ అన్ని విమానాల్లోనూ టికెట్లు అయిపోయాయి. క్రికెట్ మ్యాచ్ వల్ల ఏయిర్ ఇండియాకు చెందిన అన్ని టికెట్లు అమ్ముడుపోయాయని అధికారులు తెలిపారు. ఇక ఇతర ఎయిర్లైన్ టిక్కెట్లలో భారీ పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్కు 18, 19వ తేదీల్లో వచ్చే విమానాల టికెట్లు రూ. 45వేలుగా.
ఇంకా చదవండి: భారత్ –ఆసీస్ నేడే తుదిపోరు
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు 18, 19న ఇండిగోలో రూ. 31వేలు, చెన్నై నుంచి అహ్మదాబాద్కు రూ. 37వేలు, కోల్కత్తా నుంచి అహ్మదాబాద్కు రూ. 45వేలుగా ఉందని అన్నారు. సామాన్య రోజుల్లో టికెట్ల ధరలు ఈ రేంజ్లో ఉండవు. రూ. 10వేలు తక్కువగానే ఉంటాడు. ప్రపంచకప్ మ్యాచ్ డిమాండ్ నేపథ్యంలో టికెట్ల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. క్రికెట్ ప్రేమికులు టికెట్ల ధరలను లెక్కచేయాలని డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 55వేల వరకూ అహ్మదాబాద్కు టికెట్ల ధర కొనసాగుతోంది.