ముద్ర,సెంట్రల్ డెస్క్:-క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.షెడ్యూల్ను గురువారం బిసిసిఐ విడుదల చేసింది. ఐపిఎల్ 2024 షెడ్యూల్ను ఏప్రిల్ 7 నుండి తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్తో టోర్నమెంట్ మార్చి 22 నుండి ప్రారంభం.
2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తొలి 15 రోజుల్లో 21 మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా ప్రదర్శనలు మిగిలిన మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన బోర్డు. మొత్తం మీద స్వదేశంలోనే ఐపీఎల్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.