- తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్
ముద్రణ ప్రతినిధి :కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ముదిరాజుల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కే అని తెలంగాణ ఫిషరీ సొసైటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్ స్పష్టం చేశారు. ప్రెస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగేష్ ముదిరాజు తో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లకు ప్రత్యేక భవన ఏర్పాటు, బీసీ డీ నుండి బీసీ ఏ గ్రూపులోకి మార్చుతామంటూ ప్రకటన చేయడం, ముదిరాజ్ లకు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తామని ముదిరాజ్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి, జిల్లా స్థాయి కార్పొరేషన్లకు సమచితస్థానం కల్పిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పెసరు కుమారస్వామి, నాయకులు అయితరవేని కొమరయ్య, మహేందర్, బోయిని వెంకటేష్ తో పాటు జిల్లా ఉంటుంది.