రూ. 600 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ పోర్టుకు సమీపంలోని ఇండియన కోస్ట్ గా (ICG) పాకిస్థాన్ నుంచి వస్తున్న ఒక పడవను పట్టుకుని, అందులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.600 కోట్ల విలువైన మదక ద్రవ్యాలు (DRUGS) పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను పట్టుకుని అరెస్టు చేసింది. మదక ద్రవ్యాలు తరలిస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఆంటీన్ టెర్రరిజం స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందాలతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ తనిఖీలు చేసింది. పాకిస్థాన్ నుంచి వస్తున్న పడవలో రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించిన ఈ తనిఖీ బృందం నిందితులను అరెస్ట్ చేసి, ఆ డ్రగ్స్ ను సీజ్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో వారు తీర గస్తీదళం సిబ్బందిపై కాల్పులకు తెగబడిన సమాచారం.